కొట్టుకున్న BRS leaders..

by Disha Web Desk 13 |
కొట్టుకున్న BRS leaders..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇద్దరు కొట్టుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఓ ప్లాట్‌ను చదును చేయడానికి ప్రయత్నించగా.. ఆ ప్లాట్‌ను గతంలో ప్రభుత్వం మాకు ఇచ్చిందని.. చదును చేయడానికి నువ్వు ఎవరు అంటూ మరో బీఆర్ఎస్ యువ నాయకుడు అడ్డు చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటలు పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకానొక దశలో చెప్పులతో కొట్టుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు రంగ ప్రవేశం చేసి, యువ నాయకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి : ఏలేటి ఎటో..?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed